మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ ఎప్పట్నుంచో అనుకుంటున్న గడ్డు పరిస్థితి రానే వచ్చింది. గవర్నర్ ఆమోదముద్ర వేసిన ఏపీ మూడు రాజధానులు బిల్లు విషయంలో అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయిన ఉన్న విషయం తెలిసిందే.
అయితే మొదటి నుండి రాజధాని రైతుల వైపు గళం విప్పుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో పొత్తు కారణంగా ముందు ఉన్నంత దూకుడుగా ఉండలేక పోతున్నాడు అన్నది వాస్తవం.మరి ఇటువంటి సమయంలో పవన్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఒకసారి గమనిస్తే….
ఈ చేతకానితనం ఇప్పటిది కాదు..
గతంలో పవన్ దీక్ష శిబిరంలో రైతులకు రాజధానిని కాపాడటం కోసమే తన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుందని చెప్పాడు. ముందు రాజధాని రైతులకు మద్దతుగా భారీ పోరాటాలకు ప్రణాళికలు వేసిన జనసేన అటు బిజెపి ఈ విషయం అధికార పార్టీ చేతిలోని విషయమని… రాష్ట్ర పరిధిలో ఉన్న వాటిపై తాము జోక్యం చేసుకోమని ప్రకటించడంతో కొద్దిగా వెనక్కి తగ్గింది. చివరికి భారతీయ జనతా పార్టీ తమ అమరావతికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రస్థాయిలో తీర్మానం చేసింది కానీ దీని కేంద్రం పట్టించుకోదని చెప్పడంతో వారంతా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు అని అర్థం అయినా కూడా జనసేన ఏమి చేయలేని పరిస్థితి అయితే. ఇక్కడే అందరి చూపు జనసేన వైపు మళ్ళింది.
దీనికీ ముందుకు రాకపోతే ఎలా?
ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు బిల్లును పంతం కొద్దీ ఎంతో చాకచక్యంగా గవర్నర్ వద్ద ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఇలాంటి సమయంలో పవన్ తన గొంతు లేవనెత్తి కనీసం అమరావతి రైతులకు సరైన న్యాయం చేకూర్చే వరకు లేడా… వారికి ఏదో ఒక హామీ ఇచ్చే వరకు ఈ విషయాన్ని లాగలేదు.
అంతా రాజ్యాంగబద్ధంగా సాగింది కాబట్టి నష్టపోయిన రైతులకు ప్రతిఫలం చెల్లించాల్సింది, పరిహారం ఇవాల్సింది ప్రభుత్వమే కాబట్టి పవన్ కనీసం ఆ వైపు నుండి పోరాటం కూడా తీవ్రస్థాయిలో చేయకపోవడం ఇప్పుడు అందరినీ అతని లోని నాయకత్వ లక్షాణాలను ప్రశ్నించేలా చేసింది.
అన్న తరహా రాజకీయాలేల…?
గతంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాష్ట్ర విభజన చేయకుండా హామీ పొంది చిరంజీవి ఇలా చేశారని అంటుంటారు. ఎందుకంటే అప్పటికి పిఆర్పి సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంది. ఇప్పుడు అమరావతి విషయంలో పవన్ కూడా బిజెపితో వారు అలాంటి నిర్ణయం తీసుకునా కామ్ గా ఉన్నారు.
మూడు రాజధానులు బీజేపీ అడ్డుకోకపోగా… సహకరించిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రేపు మోడీ విశాఖ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా అఫీషియల్ గా ప్రకటించడం జరిగిన తరువాత వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తే పవన్ తన ముఖం రాష్ట్రంలో ఎవరికి చూపించుకుంటారో అతనికి, అతని పార్టీ నేతలకు మరియు జనసైనికుల కే తెలియాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?