అమరావతి: తనపై నిరాధార ఆరోపణలు చేసిన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై పరవు నష్టం దావా వేయనున్నట్లు మాజీ ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు తెలిపారు.
తనకు, తన కుటుంబ సభ్యులకు ఎవ్వరితోనూ వ్యాపార సంబంధాలు లేవని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ ప్రగతి ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని వెంకటేశ్వరరావు అన్నారు.
ప్రభుత్వ సంస్థలు, ఏజన్సీలు, సబ్ కాంట్రాక్టులతో ప్రమేయం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు.
విజయసాయిరెడ్టి తనపై చేసిన నిరాధార, హేయమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.