డైరెక్టర్ మారుతి అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలని రూపొందిస్తాడన్న పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి యూత్ సినిమాలు తీసిన మారుతి ఆ తర్వాత మెల్లగా తన పంథా మార్చి విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం, నాని తో భలే భలే మగాడివోయ్ ..లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ని తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు మారు తి సినిమాలకి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
అయితే నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు, శర్వానంద్ తో మహానుభావుడు సినిమాలు తెరకెక్కించాడు మారుతి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలబడ్డాయి. అనుకున్నంత కమర్షియల్ సక్సస్ కాకపోవడంతో గట్టిగా హిట్ కొట్టాలన్న కసితో మెగా హీరో సాయి ధరం తేజ్, రాశీఖన్నా జంటగా ప్రతీ రోజు పండగే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళీ కం బ్యాక్ అయిన మారుతి ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తియాలని సన్నాహాలు చేస్తున్నాడట.
ఆ సినిమానే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన భలే భలే మగాడివోయ్. నాని, లావణ్య త్రిపాఠి జంటగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నాని, లావణ్య త్రిపాఠి, మారుతి లకి మంచి కమర్షియల్ హిట్ ని ఇచ్చింది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని మారుతి ప్లాన్ చేస్తుకున్నాడని తాజా సమాచారం. ఇప్పటికే నాని, మారుతి ల మధ్య కథా చర్చలు జరిగినట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో అధికారకంగా ప్రకటన వెలువడనుందట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!