బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత ఎన్నో విషయాలు బయటకి వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం కూడా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వణికిస్తోంది. ప్రముఖ నటీమణులు ఇందులో ఇరుక్కున్నారు. అయితే ఊహించని విధంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ 20రోజులకు పైగా రియా జ్యూడీషియల్ కస్టడీలో ఉంది.
ఈ క్రమంలో చాలాసార్లు రియా బెయిల్ కి ప్రయత్నించినప్పటికి ఆ బెయిల్ పిటీషన్ కొట్టి వేసిన ముంబై కోర్ట్ తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేయడం చాలా మందికి షాకిచ్చింది. కోర్ట్ లో రియా చక్రవర్తిపై జడ్జి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆమెను వాడుకున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక రియా సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి డబ్బు కూడా బాగానే తీసుకుందన్న ఆరోపణలు నిజం కాలేదు. ఈ విషయంలో ఈడీ అధికారులు కూడా రియా ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు రుజువు చేయడంలో విఫలమయ్యారు. ఇక సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు అతనిది ఆత్మహత్యనే అని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో అందరు సుశాంత్ డెత్ కేసు మర్చిపోతున్న సమయంలోనే ఈ కేసు డ్రగ్స్ వైపు యూ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో రియా తో పాటు తన తమ్ముడు షోవిక్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాని డ్రగ్స్ కొనుగోళ్ళు.. అమ్మకాల ద్వారా రియా ఆర్థికంగా ప్రయోజనాలు పొందినట్లు ఆధారాలు మాత్రం దొరకలేదు. అయినా రియాని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు, ప్రజల దృష్టిలోను నిందితురాలిగా చిత్రీకరించినట్లు కొందరు భావిస్తున్నారట. అయితే ఇది కేవలం కొందరు రాజకీయ నాయకులు పన్నిన పన్నాగమే అన్న మాట వినిపిస్తుంది.