Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ Corona Vaccine విషయంలో ప్రపంచంలో అనేక దుష్ఫలితాలు వస్తున్న తరుణంలో కరోనా టీకా వేయించుకోవడానికి జనాలు భయపడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక.. ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసిన తర్వాత.. కొంతమందికి అలెర్జీలు మరి కొంత మంది మృత్యువాత పడటం జరిగింది. దీంతో చాలామందికి వ్యాక్సిన్ పట్ల నెగటివ్ అభిప్రాయం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి టెల్ అవీవ్ పట్టణంలో డ్రింక్ ఫ్రీ అనే ఆఫర్లు ఇస్తున్నారు.
పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో వార్డు బాగా రద్దీగా ఉన్న క్రమంలో కరోనా వైరస్ దెబ్బకు వ్యాపారాలు చాలా వరకు చతికిల పడ్డాయి. ఇలాంటి తరుణంలో పర్యాటకులను ఆకర్షించడానికి మరోపక్క కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడానికి ఆ దేశంలో స్థానికంగా ఉన్న జెనియా గాస్ట్రోపబ్ యాజమాన్యం వారు ఈ విధమైన ఆఫర్లు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రింక్స్ అంటే ఆల్కహాలిక్ వంటివి కాకుండా ఎనర్జీ డ్రింక్స్ నాన్ ఆల్కహాలిక్ డ్రింకులు అందించటానికి జెనియా గాస్ట్రోపబ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికే 43 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ వేయించినట్లు వార్తలు అందుతున్నాయి.