Jacqueline fernandez : జాక్విల్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మేకర్స్ కి మంచి ఛాయిస్ గా మారింది. కొన్ని ప్రాజెక్ట్స్ కి పక్కా జాక్విలెన్ ఫెర్నాండస్ నే ఎంచుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే రెండేళ్ళ క్రితం డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు. ఈ సాంగ్ పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఏదో క్రేజ్ వస్తుందని సాహో లో స్పెషల్ సాంగ్ చేస్తే అది బాగా మైనస్ అయింది.
అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా టాలీవుడ్ కి వస్తున్నారు. అది కూడా ఎక్కువగా ప్రభాస్ సినిమాలతో కావడం విశేషం. సాహోలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సైన్స్ ఫిక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని తీసుకు వస్తున్నారు. ఇక ఆదిపురుష్ లో కూడా బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27 వ సినిమాకి జాక్విలెన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Jacqueline fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది..!
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం అయి షూటింగ్ జరుగుతోంది. కాగా ఎప్పటి నుంచో ఈ సినిమాలో జాక్విలెన్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి గాని అధికారకంగా మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నిధీ అగర్వాల్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఈ ఇద్దరిని క్రిష్ ఫిక్స్ చేశాడట. మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.