ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన చేయాలని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది! త్వరలోనే జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది.. ఇప్పటికే అభిప్రాయ సేకరణకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఇక ఈ కమిటీ పని ఈ కమిటీ చూసుకుంటుంది. అయితే ఈ సమయంలోనే జగన్ కు ఒక కొత్త సమస్య వచ్చి పడిందని అంటున్నారు!
జిల్లాల పునర్విభజన టాపిక్ తెరపైకి వచ్చినప్పటినుంచీ.. అధికారపార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియాకెక్కుతున్నారు. టీవీ డిబేట్ లలోనూ వారి అభిప్రాయలాను.. పార్టీ అభిప్రాయలతో సంబందం లేకుండా నేరుగా వ్యక్తపరిచేస్తున్నారు. జగన్ ని నేరుగా కలిసి చెప్పుకునే అవకాశం ప్రస్తుతానికి లేక ఇలా చేస్తున్నారా లేక.. జిల్లాల విభజన విషయంలో అనుకూలంగా లేరా అనేది తెలియాల్సి ఉంది.
దీంతో ఈ వ్యవహారంతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశాలున్నాయని జగన్ & కో భావిస్తున్నారట. దీంతో ఈ విషయంలో కమిటీ నిర్ణయం కీలకం కాబోతుంది! ఈ కమిటీ పూర్తిగా ప్రజలందరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు ఉంటాయా లేక.. జిల్లాల విభజన విషయంలో జనం అంతా ఆసక్తిని కనబరాచడం లేదనే సలహాలు ఉంటాయా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. దీంతో ఆ కమిటీ రిపోర్ట్ లో ఏమైనా కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయని బయటపడితే మాత్రం… ప్రస్తుతానికి జిల్లాల పునర్విభజన విషయంలో జగన్ వెనకడుగువేసే అవకాశాలు ఉన్నయని అంటున్నారు విశ్లేషకులు!