కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ప్రభుత్వాలలో అదేవిధంగా వైద్యుల టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు వుండటంతో ప్రజలలో భయాందోళన ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు సూచిస్తున్న పట్టించుకోని విధంగా పబ్లిక్ ఉండటంతో వైరస్ తీవ్రత ఎక్కువైనట్లు భావిస్తున్నారు.
కరోనా కేసులు అంతకంతకూ పెరిగి పోతుండటంతో మరోపక్క విభజనతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను మరింతగా క్షీణించే పరిస్థితి దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో వైరస్ కంట్రోల్ చేసే విషయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవటం మాత్రమేగాక పింఛన్ తీసుకునే వాళ్లకి గుడ్ న్యూస్ తెలిపింది.
గతంలో పింఛన్ తీసుకునే వాళ్లకి ఆపేసిన సదుపాయాలను మళ్లీ కల్పిస్తూ జగన్ సర్కార్ సరికొత్త ఆదేశాలు ఇచ్చింది. గతంలో కరోనా వైరస్ వ్యాధి కారణంగా ప్రభుత్వ ఉద్యోగ పించన్ దారులకు పింఛన్ నిలిపివేస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వారందరికీ మళ్లీ పింఛన్ అందేలా వైసీపీ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయములో కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ మాసం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన 50% పెన్షన్ రెండు దఫాలుగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆదేశాల మేరకు డిసెంబరు మొదటి తేదీన ఆగిపోయిన పెన్షన్ అందించడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల లో సంతోషం నెలకొంది.