ప్రస్తుతం అల్లు అరవింద్ ఆహా కోసం అక్కినేని సమంత ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ అన్న పేరుతో మొదలైన ఈ టాక్ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. సమంత హోస్ట్ గా టాలీవుడ్ లోని పలువురు యంగ్ అండ్ సీనియర్ స్టార్స్ తో పాటు స్పోర్ట్స్ పర్సన్స్ ని ఈ టాక్ షోకి తీసుకు వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలని ప్రేక్షకులతో పంచుకునేలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు.
కాగా ఇప్పటి వరకు బుల్లితెర మీద ఎన్నో టాక్ షో లు వచ్చాయి. వాటన్నిటికి కంటే వెరైటీగా సమంత టాక్ షో ఉంటుందంటూ అల్లు అరవింద్ ఇంతకు ముందే చెప్పుకొచ్చారు. దాంతో ప్రోమో వదిలినప్పటి నుంచే ఈ టాక్ షో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని యంగ్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాక నెగిటివ్ టాక్ వచ్చింది.
కొత్తగా ఉంటుంది .. అందులో అందరు టాలీవుడ్ స్టార్ .. సమంత హోస్ట్ .. అనే సరికి ఈ టాక్ షో లో సెలబ్రిటీస్ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పిస్తారనుకుంటే అసలేం అర్థం కాకుండా ఉందంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం మొదటి ఎపిసోడ్ చేరుకోకపోగా రివర్స్ లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో ఎలాగైనా ఈసారి ఎపిసోడ్ అదిరిపోవాలన్నట్టుగా సెకండ్ ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవి తో ప్లాన్ చేశారు. నందిని రెడ్డి ప్రొగ్రాం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండవ ఎపిసోడ్ తో దాదాపు జనాలకి ఒక అంచనా వచ్చేస్తుందని భావిస్తున్నారు.
త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ మీద మెగా అభిమానులు, సినీ ప్రముఖులు .. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ముఖ్యంగా నటించబోతున్న సినిమాలకి సంబంధించి .. నిహారిక పెళ్ళికి సంబంధించిన విషయాలు.. అలాగే ఈమధ్య మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ పెళ్ళికి సంబంధించి వస్తున్న వార్తల పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడి కానున్నాయన్న ఆతృత చాలా మందిలో ఉంది. బేసిగ్గా ఇలాంటి టాక్ షోస్ లో చిరంజీవి చాలా తక్కువగా పాల్గొంటారు. గతంలో మంచు లక్ష్మీ టాక్ షో లో పాల్గొన్న చిరంజీవి మళ్ళీ సామ్ జామ్ లో పాల్గొన్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ లో చిరు ఎలాంటి విషయాలని ప్రేక్షకులతో పంచుకుంటారో.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!