CBI Court Breaking: జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేయడం తెలిసిందే. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు జగన్ పైన అభిమానంతోనే పిటిషన్ వేసినట్లు ఎటకారంగా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి వ్యాఖ్యానించారు. 11 చార్జిషీట్లలో ఏ1 గా..పార్టీ అధినేత ఉండటం.. ఒక పక్క పార్టీ అవమానకరంగా ఉన్నట్లు..ఆయన నిర్దోషిగా బయటపడాలి, త్వరగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ లో.. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, పిటిషన్ ని సీబీఐ న్యాయస్థానం రిటర్న్ చేయడం జరిగింది. అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది.
ఈ క్రమంలో నేడు తాజాగా తన న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఆది నారాయణ రావు .. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తన వాదనలు వినిపించినట్లు రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఎందుకు జగన్ బెయిల్ రద్దు చేయాలి అన్నదానిపై.. సీనియర్ కౌన్సిల్ న్యాయవాది.. దాదాపు ఐదారు నిమిషాల పాటు అర్థమయ్యే రీతిలో సీబీఐ న్యాయస్థానం లో వాదనలు వినిపించినట్లు వీడియో లో తెలిపారు. ఈ క్రమంలో న్యాయమూర్తి అంతా విన్న తర్వాత.. 27వ తారీఖు కి ఆయన.. తీర్పు వెలువరించడనికి.. డేట్ ఫిక్స్ చేసినట్లు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో జగన్ బెయిల్ రద్దు అవుతుందని, తమ న్యాయవాదులు మంచి ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడలేము..అన్నట్టు రఘురామకృష్ణంరాజు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే జగన్ కి నోటీసులు జారీ చేయకుండా కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు అని మరోపక్క న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు మాత్రం ఈనెల 27వ తారీఖున జగన్ బెయిల్ కు సంబంధించి సిబిఐ కోర్టు తీర్పు ఇస్తుందని .. చేస్తున్న కామెంట్ల లో.. వాస్తవం లేదని ఈ కేసులో ఏదో మతలబు ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.