అందరూ ఎంతగానో ఎదురు చూసిన ‘ట్విట్టర్ కిల్లర్’ కు ఈ రోజు తగిన శిక్ష పడింది. అతను ఇప్పటికి 9 మందితో పాటు ఒక మహిళను కూడా అతి కిరాతకంగా హతమార్చాడు. ఇప్పటివరకు ఇటువంటి సైకో కిల్లర్ లను మనం సినిమాల్లోనే చూసాం కానీ జపాన్ లో నిజంగానే ఉన్నాడు. అతడి చావు కోసం ఆ దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూసింది. జపాన్ దేశానికీ చెందిన ఈ ‘ట్విట్టర్ కిల్లర్’ పేరు ‘టకహిరో’. ఎట్టకేలకు ఇతడికి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించినప్పటికీ అతను చేసిన దారుణాలకు ఈ శిక్ష తక్కువేనని ఆ దేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.జపాన్ కు చెందిన టకహిరో అనే 30 ఏళ్ల యువకుడు ట్విట్టర్ ద్వారా కొత్త వాళ్ళను పరిచయం చేసుకుంటూ ఆలా పరిచయమయిన వారిని టార్గెట్ చేసుకుని వారిని అతి కిరాతకంగా చంపుతూ సైకోలా మారాడు. సినిమాలలో చూపించే విధంగా చంపిన వారి ముఖాలను చెక్కివేయడం, శరీర భాగాలను బాక్సుల్లో పెట్టి భద్రపరిచేవాడు.టకహిరో టార్గెట్ 15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసుగల వారు మాత్రమే. ఇతడి కిరాతమైన పనులకు జపాన్ లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ రోజు కోర్టు తీర్పును వినడానికి కోర్టు బయట పెద్ద ఎత్తున జనాలు కిక్కిరిసారు. టకహిరో కి కోర్టు ఉరిశిక్ష వేయడంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని టార్గెట్ చేసి తాను సహాయపడుతానని నమ్మించి వారితో మాట కలిపేవాడు. వారిని తన అపార్ట్ మెంట్ కు రప్పించి చంపేసేవాడు.ఇటీవల ఓ యువతి మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తూ ‘టకహిరో’ ను అనుమానించి అరెస్ట్ చేసి అతని ఇంటిని శోధించగా వారికి 9 మృతదేహాల శరీరభాగాలు కనిపించాయి. దర్యాప్తు తరువాత తాజాగా మరణశిక్ష విధించారు. జపాన్ లో తప్ప మరి ఏ సంపన్న దేశాలలోను మరణ శిక్ష లేదు.