తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈనెల 5వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విపరీతమైన వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. మరి తెలంగాణలో జరుగుతున్న ఈ భేటీకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా…? 5వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. కొత్త సచివాలయ భవన సముదాయం, నియంత్రిత సాగు, కరోనా వైరస్ వ్యాప్తి, విద్యారంగంలో ఈ సంక్షోభ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని కేంద్రం ప్రకటించింది.
అయితే ఇదే రోజున కేంద్ర జల వనరుల మంత్రి శాఖ మంత్రి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ బేటీ జరగవలసి ఉంది. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణం పై జీవో జారీ చేసినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం దానిపై తీవ్రమైన వ్యతిరేకతను కనబరిచింది. తమకు దక్కాల్సిన నీటిని వారు లాక్కుంటున్నారని కృష్ణ బోర్డు ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి ప్రాజెక్టు పనులను ఆపివేయించా… తాజాగా జగన్ అందుకు సంబంధించి టెండర్లు కు ఆహ్వానం ఇవ్వగా ఇంకా మండిపోయిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే బోర్డులకు ఫిర్యాదు చేసి పై స్థాయిలోకి విషయాన్ని చేర్చింది.
అటు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అక్రమమైనవేనని పెద్ద పాయింట్ లేవనెత్తగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ ప్రాజెక్టులపై ఇదే విషయాన్ని ఆరోపించింది. వీటన్నింటి నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ లో పెద్ద స్థాయిలో జరగవలసి ఉండగా… రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కేంద్రం సమాచారం పంపింది. అయితే ఈ భేటీకి కేసీఆర్ సముఖంగా లేరని తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీని 20వ తేదీకి వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఆ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరిస్తుందా లేదో తెలియని పరిస్థితి. అందుకే వ్యూహాత్మకంగా కేబినెట్ ఏర్పాటు చేశారు అన్న చర్చ జరుగుతోంది.
ఇక ఇదిలా ఉండగా గా కొత్త సచివాలయ భవనం నిర్మాణం డిజైన్లు పరిశీలించడానికి, హరితహారం అంటూ ఎన్నో విషయాలకి వీలున్న కేసీఆర్ తన పంతానికి పోయి పెట్టించుకున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ సమయంలో ఇలా మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని అందరి ప్రశ్న. జగన్ ఏపీ 3మూడు రాజధానులు విషయం లో విజయం సాధించిన తీరు మరియు అతని పాలన వ్యవహారాల్లో ఈ మధ్య కనబరుస్తున్న దూకుడు చూసి కేసీఆర్ బెదిరిపోయాడని కొంత మంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి వీటన్నింటికీ కేసీఆర్ సమాధానం చెప్పే సమయం ఎప్పుడు?