KCR : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ కు సరైన పోటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఎదగడంలో విఫలం కావడంతో టిఆర్ఎస్ పార్టీ వారు ఆడిందే ఆట పాడిందే పాటగా అక్కడ ఇన్నిరోజులు రాజకీయం కొనసాగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ కి ఉన్నట్టుంది గడ్డు పరిస్థితి ఎదురయింది.
దుబ్బాక ఉప ఎన్నికల షాక్, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాల గుర్తులు మరిచిపోకముందే అతనిని కోలుకోనివ్వకుండా ఒక వైపు బిజెపి మరోవైపు వైఎస్ షర్మిల దాడి చేస్తున్నారు. బిజెపి వారేమో వీలుచిక్కినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ అయితే ఈమధ్య సహనం కోల్పోయి బిజెపి వారిపై అనూహ్య రీతిలో ఎదురుదాడి దిగిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఎవరైనా అడిగితే ఎడమకాలు చెప్పు ని చూపించండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది కేసీఆర్ పైన సెటైర్ అయినప్పటికీ టిఆర్ఎస్ వారికి ఆ మాటలు బాగానే గుచ్చుకున్నాయి.
ఇక వై యస్ షర్మిల విషయానికి వస్తే తెలంగాణలో ఎవరూ తమ స్థానికతను ప్రశ్నించే హక్కు వారికి లేదని గట్టి రిప్లై ఇచ్చారు. కెసిఆర్, విజయశాంతి ఎక్కడ పుట్టారు అని ఆమె అడిగిన ప్రశ్నకు సమీడియా నుండి మాధానం రాలేదు. కెసిఆర్ పరిపాలన పై ఆమె విమర్శలతో కూడిన ఆరోపణలు సంధించారు కరోనా సమయంలో జనాలంతా అల్లాడిపోతుంటే కేసీయార్ ఏమన్నా పట్టించుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.
లక్షలకు లక్షలు దోచుకున్న ఆస్పత్రుల పై కూడా ఆయన దృష్టి పెట్టలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమై పోయిందని చెప్పిన ఆమె త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర కూడా చేయబోతున్నట్లు తెలిపింది. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తే అది కేసీఆర్ కు మరొక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే విద్యార్థుల దృష్టి తనవైపు తిప్పుకున్న షర్మిల తెలంగాణ రాష్ట్రం మొత్తం కాలి నడకన తిరిగితే టిఆర్ఎస్ క్యాడర్ పైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. మరోవైపు బిజెపి అనూహ్య రీతిలో పుంజుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్ తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి వీరిద్దరినీ నిలువరించకపోతే అతని సీఎం కుర్చీకే ప్రమాదం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.