తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేసిఆర్ ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ ను కేసిఆర్ అధికారికంగా కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్ నేతలకు కేసిఆర్ వివరించారు. దేశంలో అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నామనీ కేసిఆర్ వారికి తెలిపారు. రాష్ట్రాల ప్రయోజనాలను కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా కలిసి వచ్చే పార్టీలతో బీఆర్ఎస్ ను తీర్చిదిద్దుతానని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు 1.19 గంటలకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మాానం ఆమోదించాారు. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని చెప్పారు కేసిఆర్. పలు రాష్ట్రల నేతల సమక్షంలో కేసిఆర్ ఈ ప్రకటన చేశారు.
తొలుత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరైయ్యారు. జడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేళ ప్రగతి భవన్ కు ఆ పొరుగు రాష్ట్రాల నేతలు