NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరు కొరటాల శివ. రాజమౌళి తర్వాత అదే తరహా హిట్ గ్రాఫ్ కలిగిన డైరెక్టర్ కొరటాల. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. దాదాపు కెరీర్లో చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని కొరటాల ఈ సినిమా చేస్తూ ఉన్నారు. మధ్యలో కరోనా వైరస్ రావటంతో అనేక ఇబ్బందులు ఇండస్ట్రీతో పాటు ఎదుర్కొన్న కొరటాల శివ తన తర్వాత ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 30 వది కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి మొదటిలో త్రివిక్రమ్ చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు కానీ కొరటాలకు ఈ అవకాశం దక్కింది. గతంలో కొరటాల ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ అనే సినిమా చేశారు అది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతు ఉండటంతో ఈ సినిమాలో హీరోయిన్ కోసం గతంలో “భరత్ అనే నేను” సినిమాలో మహేష్ తో చేయించిన అందాల భామ కియారా అద్వానీ ని తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో… ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు.. హీరోయిన్ పాత్రకి కూడా చాలా వెయిటేజీ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపధ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ పడాలని ముఖ్యంగా రాజమౌళితో చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో .. ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.