కొద్దిరోజుల క్రితమే తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న తెలంగాణ ప్రజలకు నేడు మరొక శుభవార్త. తెలంగాణ చరిత్ర గురించి తెలియజేస్తూ మరియు ఆ రాష్ట్ర సౌందర్యం యొక్క రమణీయతను వివరిస్తూ రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ గీతాన్ని ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించగా అందులో రాష్ట్రం లోని ప్రకృతి యొక్క రమణీయతను, కలలను మరియు తెలంగాణ సంపదను వివరిస్తూ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన గీతం చాలా అద్భుతంగా ఉంది.
దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తనకు తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందని మరియు రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్య, శిల్ప కళ గురించి వర్ణించే ఈ పాట మనసును హత్తుకుంది అని ఆయన అన్నారు.