మహి వి రాఘవ అంతక ముందు యాత్ర సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న mahi v raghava యాత్ర సినిమా తీస్తున్న అనగానే ఎన్నో సంచలనమైన వార్తలు వచ్చాయి. రక రకాల రూమర్స్ కూడా క్రియేటయ్యాయి. అయితే అవన్నీ yatra రిలీజయ్యాక మాత్రం తుడిచిపెట్టుకుపోయాయి. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం yatra లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గా మమ్ముట్టి అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు.
కాగా అప్పటి నుంచి yatra కి సీక్వెల్ గా yatra 2 సినిమా తెరకెక్కించాలని దర్శకుడు mahi v raghava సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు yatra 2 అన్న టైటిల్ తో ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. వాస్తవంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా yatra 2 తెరకెక్కబోతుందన్న వార్తలు వచ్చాయి. ఇక ఈ సీక్వెల్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వస్తుందని అనుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. దాంతో ఫ్యాన్స్ ఈ సినిమా సీక్వెల్ ఉండదని చెప్పుకోవడం మొదలు పెట్టారట. ఈ క్రమంలోనే దర్శకుడు యాత్ర 2 ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయినట్టు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మల్టీస్టారర్ తర్వాత మళ్ళీ yatra 2 పట్టాలెక్కుతుందని లేటెస్ట్ అప్డేట్. మరి అఫీషియల్ గా దర్శకుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.