Manjima Mohan: ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక సినిమాలో కలిసి నటించడం, కొన్ని రోజులకి ప్రేమలో పడటం, ఆపై పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నారు కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మెహన్. వీరి ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియాని వేదికగా షేర్ చేసుకున్నారు. దేవరాట్నం (2019) సినిమాలో కలిసి నటించినప్పుడు వీరి ప్రేమకు బీజం పడింది. ఒకప్పుడు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని వార్తలు చెక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఆ వార్తలన్నీ నిజమే అంటూ వారిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
Manjima Mohan: లవ్ మ్యారేజ్
అంతేకాకుండా ఈనెల 28న చెన్నైలోనే ఒక స్టార్ హోటల్లో వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వివాహానికి వారి సన్నిహితులు, బంధువులు, సినీ ప్రముఖులు కొంతమంది హాజరు కానున్నారట. ఈ సందర్భంగా మంజిమా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫొటోలన్నీ డిలీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో మంజిమా సడన్గా ఫోటోలను ఎందుకు డిలీట్ చేసిందా?? అని రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అందుకేనట
కాగా డిలీట్ చేసిన ఫొటోల గురించి తాజాగా మంజిమా స్పందించింది. కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను కాబట్టి పాత జ్ఞాపకాలు చూసి బాధ పడకుండా ఉండాలనే ఉదేశ్యంతో ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు డిలీట్ చేశాను, అంతేకాకుండా కొత్త జీవిత జ్ఞాపకాలను భద్రపరుచుకోవడానికి కాస్త చోటు అవసరం పడిందం”టూ చెప్పుకొచ్చింది. మంజిమా తన ఇన్స్టాలో కాబోయే భర్త గౌతమ్ కార్తీక్ ఫొటోలు మాత్రమే ఉంచింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ స్టార్ హీరో శింబు సరసన ‘పతుతాళ’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో ఎన్టీఆర్: కథానాయకుడు, ఎన్టీఆర్: మహా నాయకుడు సినిమాలలో నారా భువనేశ్వరి పాత్ర చేసింది. కాగా ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ అనే తెలుగు సినిమాలో ఇప్పుడు నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!