అఖిల్ చాలా మారాడు. ఇంతకు ముందులాగా ఆచితూచి అడుగులు వేయడం లేదు. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవని, ఆచరించి చూపడం ఒక్కటే మార్గమని అర్థం చేసుకుంటున్నాడు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వ్యక్తుల్లో వచ్చే మెచ్యూరిటీ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు సన్నిహితులు. ఆయన తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల దైవ సన్నిధానంలో జరిగాయి. అక్కినేని, మెగా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట వెంటనే షెడ్యూల్స్ ప్లాన్ చేసి, ఈ ఏడాది రెండో భాగంలో విడుదల చేయాలని సంకల్పం. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా అఖిల్ ఇప్పుడే ఆలోచిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఇటీవల అఖిల్ని కలిసి స్క్రిప్ట్ చెప్పారట. తరచూ వీరిద్దరు కలుస్తుండటాన్ని బట్టి, సినిమా ఓకే అయినట్టేనని టాక్. అన్నీ సవ్యంగా జరిగితే ప్రశాంత్ వర్మ సినిమా దసరాకు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికిగానీ, వేసవికి గానీ ఎయిమ్ చేసి తెరకెక్కించే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయని టాక్. ఈ విషయం గురించి అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!