Boyapati Srinu: తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిజాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన సినిమాల్లో కథానాయకుడి కళ్లకు ఎక్కడ చూసినా అన్యాయం కనిపిస్తే చాలు… ఈ అన్యాయానికి పాల్పడిన విల్లన్స్ కి అతని మద్దతుదారులకి దాబిడి దిబిడే. ఒక్క దెబ్బతో విల్లన్స్ నీ అంతమొందించే సీన్స్ కోకొల్లలుగా ఉంటాయి. మొదటి సినిమా నుంచి తన హీరోల ఫార్ములాను సేపరేటుగా చూపిస్తారు. బోయపాటి సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తాయి. అటువంటి బోయపాటి తాజాగా ఎన్నికలలో ఓటు వేసే దాని గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇటీవల గుంటూరులో ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కల్చరల్ స్పోర్ట్స్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బోయపాటి శ్రీను కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో యువత అంతా పోలింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసే ముందు మీ కోసం కాకుండా భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడికి వేయాలని సూచించారు. అలా ఓటు వేసినప్పుడే సమాజం అందరి భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బోయపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే సమయంలో ఇంజనీర్లు ఎంత స్థాయికి ఎదిగిన జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం వదిలిపెట్టొద్దని సూచించారు. తాను కూడా ఇదే కాలేజీలో చదివినట్లు పేర్కొన్నారు. బోయపాటి శ్రీను నెక్స్ట్ బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ గతంలో మూడు సినిమాలు చేయగా అవి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఈసారి ఎన్నికల అయిపోయిన అనంతరం గతంలో తీసిన “అఖండ” సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!