Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా వాయిదా పడటం తెలిసిందే. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రెండు భాగాలుగా సలార్ రాబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే మొదటి భాగానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ సీజీఏ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పాటు అనుకున్న టైం కి ఇవ్వలేమని.. సదరు గ్రాఫిక్ సంస్థ తెలియజేయడంతో.. సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఇదే సమయంలో సినిమాకి అవే ప్రాధాన్యం కావడంతో ప్రశాంత్ నీల్ చాలా కూల్ గా వర్క్ చేయాలని ఔట్ పుట్ బాగా రావాలని చెప్పడంతో సలార్ మొదటి భాగం ఫిబ్రవరి మాసంలో ఇస్తామని స్పష్టం చేశారట.
దీంతో నిర్మాతలు ఈ సినిమాని వేసవి టార్గెట్ గా చేసుకుని మార్చి 22వ తారీకు విడుదల చేయడానికి కొత్త తేదీ ఫిక్స్ చేసుకున్నారట. మార్చి నెల అనేసరికి తాజాగా బయ్యర్లు సలార్ నిర్మాతలకు ఊహించని షాక్ ఇచ్చారట. మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హక్కులు 160 కోట్లు పలకడం జరిగిందట. అయితే మార్చి 22 రిలీజ్ అయితే మాత్రం 120 కోట్లు మాత్రమే ఇస్తామని.. తాజాగా నిర్మాతలకు స్పష్టం చేశారట. ముందుగా అనుకున్న డబ్బులు ఇవ్వబమని తగ్గించాలని బయ్యర్స్ సల్లార్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.
అంత టైం అయితే మాకు వడ్డీలకే డబ్బులు పోతాయి మిగిలేది ఏముంటుందని.. సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారట. దీంతో సలార్ నిర్మాతలు బయ్యర్స్ ఒత్తిడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో పక్క వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సినిమా పైన ఆశలు పెట్టుకోవడం జరిగింది. ప్రభాస్ అభిమానులు సైతం సలార్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందట. ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేసే సీన్ సినిమా మొత్తానికే హైలైట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసినట్లు సమాచారం.