Devatha Serial: రాధా ఆదిత్యకు దేవిని ఎలా దగ్గర చేయాలని ఆలోచిస్తూ వంట చేస్తుంది.. ఆ పరధ్యానంలో ఉండి పాలలో ఉప్పు వేస్తుంది రాధ.. అది చూసిన వాళ్ల అత్తయ్య అదేంటమ్మా రాధా పాలలో ఉప్పు వేసావు అని అంటుంది.. ఏదో ఆలోచనలో ఉండి అలా చేశాను అని అంటుంది..! నన్ను క్షమించండి పాలు విరిగిపోయాయి ఏదో శుభం జరుగుతుంది కదా అని అంటుంది అదే పాలలో కాస్త పంచదార వేస్తే కోవా అవుతుంది. మనం చేసిన తప్పును సరి చేసుకోవచ్చు అని అంటుంది. ఆమె మాటలు విన్న రాధ ఆలోచనలో పడుతుంది..!
దేవీ, చిన్మయి ఆడుకుంటూ ఉండగా.. చిన్మయి ని పిలుస్తుంది రాదా. దేవి మాట్లాడటం లేదని ఆఫీసరు బాధపడుతున్నారు. ఒకసారి నువ్వు మాట్లాడు కాస్త హ్యాపీ గా ఫీల్ అవుతారు అని వాళ్ల తాతయ్య ఫోన్లో నుంచి ఫోన్ చేస్తుంది రాదా. ఆదిత్య ఫోన్ తీసిన వెంటనే దేవి అని అంటాడు. అంకుల్ నేను చిన్మయిని అంటుంది. సారీ చెప్పి మాట్లాడుతూ ఉండగా అమ్మ మాట్లాడుతుంది మీతో అని రాధకు ఫోన్ ఇచ్చి పక్కకు వెళ్లి పోతుంది.. వెంటనే మిమ్మల్ని కలవాలి అని చెబుతోంది.
ఆదిత్య దగ్గరకు వచ్చిన రుక్మిణీ నీకు నా బిడ్డను ఇచ్చేదం అనుకుంటున్నా.. దేవిని మీకు ఇవ్వాలంటే.. నాదొక కండిషన్.. దేవికి కన్న తండ్రి దేవి మీ కన్న బిడ్డని దేవికి ఎప్పటికీ తెలియకూడదు. ఈ మాట మీరు నాకు ఇస్తే నేను మీకు ఇవ్వడానికి సిద్ధం అని చెబుతోంది. తప్పకుండా దేవికి ఈ విషయం తెలిసి ఆదిత్య మాట ఇస్తాడు. అయితే మీరు దేవుని తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి అని అంటుంది. అయితే ఈ సంతోషకరమైన విషయం ఇప్పుడే మా ఇంట్లో వాళ్ళకి చెబుతాను అని ఆదిత్య అక్కడనుంచి వెళ్ళిపోతాడు. అంటే నేను నీ కుటుంబం లో మనిషిని కదా పెనిమిటి అని రుక్మిణి ఏడుస్తుంది. రాధా మాధవ్ ని ఏమని ఒప్పిస్తుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..