Senior actress Girija: ఒకానొక సమయంలో ఇండస్ట్రీని బీభత్సంగా షేక్ చేస్తూ తన మాటతీరుతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన వారిలో గిరిజ ఒకరు. ఆ కాలపు నటీమణులలో ఈమె కూడా ఒకరు. కామెడీ గా నటించాలంటే అప్పట్లో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ఇలా చాలామంది మెయిల్ కమెడియన్స్ ఉండగా ఫిమేల్ కమెడియన్ ఉండేవారు. వారిలో గిరిజ మంచి ప్రసిద్ధి చెందారు. ఈమె కనుక ఒక కామెడీ పాత్ర చేస్తే అది పక్కా సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గిరిజ.. రేలంగితో ఓ పాత్ర చేస్తే అది బీభత్సంగా హైలెట్ అవుతుంది. అంతగా ఈ జంట ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అనంతరం రాజబాబు మరియు రమప్రభ జంట వచ్చాక ఈ జంట కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
గిరిజ రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. మరీ ముఖ్యంగా 50 మరియు 60 ల కాలంలో ఈమె కెరీర్ జోరుగా సాగింది. పరమానందయ్య శిష్యుల కథ తో మొదలైన గిరిజ కెరీర్ పాదాల భైరవి తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అనంతరం వెలుగునీడలు, నా ఇల్లు వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమస్ అయిపోయింది. అనంతరం తమిళ్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అప్పట్లో సినిమాకి హీరో మరియు హీరోయిన్ ని చూసుకున్న వెంటనే కమెడియన్ గా గిరిజానే ఎక్కువ తీసుకునేవారు డైరెక్టర్లు. హీరో మరియు హీరోయిన్ ఎవరైనా కమెడియన్ పాత్రలో మాత్రం గిరిజనే ఉండాలి అని అనుకునేవారు ఆతరం డైరెక్టర్లు.
హీరోయిన్ గా రాణిస్తే ఒకటి రెండు సినిమాలు మాత్రమే దక్కుతాయి. అదే సైడ్ క్యారెక్టర్స్ మరియు కమెడియన్ పాత్రలలో నటిస్తే అన్ని సినిమాలు ఆమెవే అని ఆలోచించిన గిరిజ కమెడియన్ రంగంలోకి దిగింది. ఇక అలా రెండు ఇండస్ట్రీలలో రెండు తరాలు రాణించి రెండు చేతులతో సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆస్తిపాస్తులను బానే వెనకేసింది. ఆనాటి కాలంలో జయలలిత మరియు రజనీకాంత్ తరువాత గొప్ప బంగ్లా ఉన్నది గిరిజకే. లంకంత కొంప కానీ ఈమెని ఇండస్ట్రీ నుంచి దూరం చేసింది మాత్రం ఆమె ప్రేమే. గిరిజకు సన్యాసి రాజు అనే కో డైరెక్టర్ ప్రేమ కుదరడంతో పీకల్లోతులో ప్రేమలో మునిగింది. అందరూ నో అంటున్నా సరే అతడితోనే లోకాన్ని ఏలుతా అంటూ ముందు అడిగేసింది. ఆఖరికి తనతో అనేక సినిమాలు చేసిన రేలంగి చెప్పిన వినకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.
అనంతరం ఆ కో డైరెక్టర్ని పెళ్ళాడింది కూడా. ఎప్పుడైతే ఇండస్ట్రీలో పెద్దల మాట కాదని ఆయనని పెళ్లాడిందో ఇక అక్కడి నుంచి ఆమె పతనం స్టార్ట్ అయింది. ఇక అనంతరం వీరు ఓ నిర్మాణ సంస్థను సైతం స్థాపించారు. ఇక అప్పట్లో ఆ నిర్మాణ సంస్థకి మంచి ప్రాధాన్యత దక్కింది. ఇక ఇప్పటిలో క్రికెట్ బెట్టింగ్స్ ఎలానో అప్పటిలో గుర్రాల పందాలు అలా. వీటిలో గిరిజ భర్త డబ్బంతా ధారబోయడంతో ఈమె ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సిన స్థితి పట్టింది. రకరకాల కార్లలో తిరిగిన ఈమె అనంతరం అద్దిళ్లల్లో ఉంటూ తిండికి మోహమాసింది. ఇక అటువంటి సమయంలో ఎవరినైనా డబ్బులు అడుగుదామా అని ఆలోచించే గిరిజ ని చూసి ప్రతి ఒక్కరు తప్పించుకుని వెళ్ళిపోయేవారు. అలా ఆఖరి రోజుల్లో తిండి కూడా సరిగ్గా లేక ఈమె కన్ను మూసింది. అంత గొప్ప కమీడియన్ ఆ విధంగా కన్ను మూయడం బాధాకరమని చెప్పొచ్చు.