హీరో నిఖిల్ నటించిన చిత్రం `అర్జున్ సురవరం`. ఎప్పుడో మే మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమాకు అవెంజర్స్: ఎండ్ గేమ్ రూపంలో గండం ఎదురైంది. ఏప్రిల్ 26 న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఎండ్ గేమ్ భారీస్థాయిలో విడుదలవుతుందని.. ఆ తర్వాత మజిలీ, చిత్రలహరి, జెర్సీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయంటూ డిస్ట్రిబ్యూటర్స్`అర్జున్ సురవరం` చిత్రాన్ని విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో నిఖిల్ డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేర `అర్జున్ సురవరం`ను వాయిదా వేశారు. తర్వాత మరో మంచి రిలీజ్ డేట్ అయితే దొరకలేదు. ప్రేక్షకులకు కూడా అసలు ఈ సినిమా ఉందనే విషయాన్నే మరచిపోయారు. ఇలాంటి తరుణంలో హీరో నిఖిల్ `సాహో` రిలీజ్ తర్వాత తమ సినిమా రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు కానీ డేట్ మాత్రం చెప్పలేదు.
previous post
next post