కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘భారతీయుడు 2’. క్రియోటివ్ జీనియస్ శంకర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా 1996లో సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ కి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా శంకర్, కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
రోబో 2 తర్వాత శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో సమస్యలతో సాగుతుంది. చెప్పాలంటే కమల్ హాసన్ అలాగే శంకర్ సినిమాలలో ఎప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న సినిమా లేదనే చెప్పాలి. అయినా ఈ ఇద్దరు ధైర్యంగా సినిమాని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని కోలీవుడ్ మీడియా సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్దార్థ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తుంది. చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సస్ ని సాధించిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శృతిశర్మ కి ఈ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. అంతేకాదు ఈ బ్యూటి సీనియర్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కి పోటి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఒక్క సినిమాతోనే ఈ సీనియర్ హీరోయిస్ కి ఎంతవరకు పోటీ వస్తుందో చూడాలి.