సూపర్స్టార్ మహేష్ హీరోగా రూపొందుతోన్న 25వ చిత్రం `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మించిన చిత్రమిది. మే 9న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రేడ్ వర్గాల కథనం ప్రకారం సినిమా భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ను పూర్తి చేసుకుందట.
నైజాం హక్కులు 22 కోట్లు.. సీడెడ్ 12 కోట్లు, ఆంధ్ర 38 కోట్ల రూపాయలకు హక్కుల అమ్ముడయ్యాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు 72 కోట్లకు అమ్ముడయ్యాయట. కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్ హక్కులు 12 కోట్ల రూపాయలకు అమ్ముడు కాగా.. డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కులు కలిపి 47 కోట్లు వచ్చాయట. అంటే మొత్తంగా సినిమాకు 141.50 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
మహేష్ గత చిత్రం భరత్ అనే నేను సినిమా క్లోజింగ్ షేర్ బిజినెస్ 94.5 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మారట
previous post
next post