Manasu Mamatha: ఒకపక్క యాంకర్ గా మరోపక్క యాక్టర్ గా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. కానీ అలా రాణించిన వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. తాము తీసుకునే డబ్బు కోసం కాకుండా తమకి వచ్చే పేరు కోసం పనిచేసేవారు ఇండస్ట్రీలో మంచి పేరును కలిగి ఉంటారు. కానీ డబ్బు కోసం పని చేసేవారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడలేరు. ఏడో తరగతిలోనే యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది మౌనిష. యాంకర్ గా నటిగా ఏ ఒక్క అవకాశం వచ్చిన వదులుకోలేదు. అదేవిధంగా ప్రతి పాత్రను ఆమోదించలేదు. మంచి చెడులు అనేవి ఈమెకు చాలా తెలుసు. ఏదో ఒక రోజు వెండితెరపై పేరు తెచ్చుకోవాలని సంకల్పంతో ముందుకి సాగుతుంది మౌనిష. ఇక ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది హైదరాబాదులోని.
తండ్రిది వైజాగ్ కాగా తల్లిది హైదరాబాద్. ఇక తల్లికి మొదటి నుంచే పాటలు మరియు చదువు అంటే చాలా ఇష్టం. కానీ అప్పటి కాలంలో ఈమెకి పెళ్లి పిల్లలు అంటూ అలా కాలం సాగిపోయింది. ఇక తన ఆశ ఆశగానే మిగిలింది. ఇక చిన్నప్పటినుంచి డాన్స్ మరియు ఆటలు, సాంస్కృతి కార్యక్రమాలు అంటే ఎంతో ఆసక్తిగా ఉండేది మౌనిష. స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగిన పాల్గొనేది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు యాంకరింగ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని తన తల్లి మౌనిష ఫోటోలను పంపింది. ఇక వారి దగ్గర నుంచి కవరు రాగానే మౌనిష తల్లి ఎంతో సంతోష పడింది. ఇక వెంటనే ఆడిషన్స్ కి తీసుకెళ్ళింది. ఆడిషన్స్ ఏ కదా చూద్దాంలే అని బయలుదేరారు. కానీ వెళ్ళగానే మౌనిషాకి మేకప్ వేసి షూట్ చేశారు.
స్కూల్ కి వెళ్తూనే వేసవి సెలవుల్లో కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసింది. అలా అమ్మ ప్రోత్సాహంతో యాంకర్ గా స్థిరపడింది. మాటీవీలో యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం సీరియల్ లో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని చేయలేకపోయింది. అనంతరం జీతెలుగు ఆడిషన్స్ కి ఫోటోలు పంపింది. ఇక అప్పుడు ఈమె దగ్గర మూడేళ్ల అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ మూడేళ్లు ఏ ఛానల్లోనూ పనిచేయకూడదు సినీ పరిశ్రమకు ఏ సంబంధం లేకుండా ఉండాలని తీసుకున్నారు. ఇక ఆ సమయంలో చాలామంది సెలబ్రిటీస్ను ప్రత్యక్షంగా చూసింది మౌనిష. అలా ఆ మూడేళ్లు అగ్రిమెంట్ కి ఒప్పుకొని ఎంతో సంతోషమైన లైఫ్ ని లీడ్ చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఆ సమయంలోనే ఈమెకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయట. కానీ చిన్నపిల్ల కావడంతో అప్పుడే సినిమాలు ఎందుకు అని ఆలోచనతో ఒప్పుకోలేదు.
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో నటించింది. మాటీవీలో ప్రసారమైన క్రాంతి ఈ ముద్దుగుమ్మ మొదటి సీరియల్. ఇక జెమినీలో సుడిగుండాలు, సిరిమల్లి వంటి సీరియల్స్ లో నటించింది. ఇక వీటన్నిటిలో కంటే గోకులంలో సీత అనే సీరియల్ ఈమెకి మంచి పేరు తెచ్చింది. ఒకే సమయంలో రెండు భిన్నమైన క్యారెక్టర్స్ కావడంతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక అలా వచ్చిన క్రేజ్ తోనే కార్తీకదీపం సీరియల్ లో కూడా నటించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమెకి పెళ్లయినట్లు సమాచారం. ఇండస్ట్రీలోనే స్థిరపడ్డ ఈ ముద్దుగుమ్మ మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాడినే పట్టి పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె తన మొగుడిని ఇంట్లో పెట్టి బయట మరో ప్రియుడుతో తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ యువకుడు ఎవరో తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.