Kumkuma Puvvu March 30 2024 Episode 2143: చనిపోయిన లాయర్ భార్య కమల అంజలి చెప్పిన ప్లాన్ ప్రకారం శాంభవి గారి ఇంటికి పిల్లల్ని తీసుకుని వస్తుంది. ఆవిడను చూసినా చరణ్ శాంభవి షాక్ అవుతారు.కమల రాకను చూసి అంజలి ఎదురుగా వెళ్లి ఆగండి ఎవరు మీరు ఎందుకు ఇలా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు అని అడుగుతుంది కమల నేను ఈ జయచంద్ర ఫౌండేషన్ కి బోర్డు మెంబర్అయినా లాయర్ గారి భార్యను నా పేరు కమల అని చెబుతుంది.అంజలి లాయర్ గారి భార్య అయితే ఏంటి ఇప్పుడు అని అంటుంది.కమల ఏంటంటే నేను ఇక్కడికి న్యాయం కోసం వచ్చాను ఈ ఇంట్లో ఉన్న శాంభవి గారు ఆవిడ కొడుకు నా జీవితానికి తీరని గాయం చేశారు అందుకోసమే న్యాయం కోసం ఇంటి ముందుకు వచ్చాను అంటుంది కమల. అంజలి ఏంటా గాయం అసలు విజయ శాంభవి గారు ఎంత పెద్ద మనసున్న మనిషో తెలుసా ఆవిడ గురించి ఇలాగే నా మాట్లాడేది మీరు నిందలు వేసినంత మాత్రాన మేము శాంభవి గారి గురించి తప్పుగా అనుకోలేము అని అంటుంది అంజలి.
అప్పుడే బంటి అమృత అరుణ్ కుమార్ అక్కడికి వచ్చి వాళ్లందరూ కమలతో కలిసి డ్రామా మొదలు పెడతారు. కమల అమ్మ మీరు అందరూ అనుకున్నంత మంచిది కాదు ఆ శాంభవి గారు ఆ శాంభవి ఆవిడ కొడుకు చరణ్ రాజ్ ఇద్దరు కలిసి నా భర్తను చంపేశారు అని చెబుతుంది.అక్కడ ఉన్న పని వాళ్ళందరూ వింటారు.మాధవి ఇది డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కొంప ముంచేలా ఉంది కదా అని మనసులో అనుకుంటుంది మంచిదే ముంచింది కానీ మా ఆయన పేరు కూడా చెబుతుంది కదా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంటిదాకా రాకముందుకే చూసుకోవాలి అసలు ఈ తల్లి కొడుకులు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థం అవుతుందో లేదో అని అనుకుంటూ ఉంటుంది మాధవి. అరుణ్ కుమార్ ఏంటి ఏం మాట్లాడవు అసలు శాంభవి గారు అంటే ఈ దాచిన పల్లికి దేవత లాంటివారు ఆవిడ దయవల్లే కదా మేము ఇక్కడ ఉంటున్నాము మరి అలాంటప్పుడు ఆవిడ ఇలాంటి పనులు చేస్తారా చెప్పు అని అంటుంది కమల లేదు నేను చెప్పేది నిజం ఆవిడ నా పసుపు కుంకుమలు తూర్పు వేసింది ఆవిడ కొడుకు నా భర్తని కత్తితో పొడిచి చంపాడు ఇది ముమ్మాటికి నిజం అని అంటుంది.
చంపాడు అంటున్నావు మరి దేనికోసం వచ్చావు అని అడుగుతుంది కమల నా పిల్లలకు నాకు న్యాయం జరగాలని వచ్చాను ఇక్కడ న్యాయం జరగకపోతే నేను సిటీకి వెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను అప్పుడు ఈ శాంభవి గారి గురించి అప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఆ పోలీసు వాళ్లే నాకు న్యాయం చేస్తారు అని అంటుంది కమల అంజలి వద్దు వద్దు నువ్వు అంత పని చేయకు నీకు కావాల్సింది నష్టపరిహారమే కదా శాంభవి గారు నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చేరదీసి అన్నం పెడుతుంది మరి సహాయం చేయదని ఎలా అనుకుంటున్నావు కచ్చితంగా చేస్తుంది శాంభవి గారు అంటుంది అంజలి బంటి అవునవును శాంభవి గారంటే అన్నపూర్ణాదేవి కష్టాల్లో ఎవరు కనపడినా సరే వాళ్ళకి నీడని చీ బుక్కెడు అన్నం పెడుతుంది అలాంటి దేవత మీద నువ్వు కేసు పెడతాను అంటావా తప్పు తప్పు వద్దు అలా చేయకండి అంటాడు బంటి. కమల అయితే నాకు న్యాయం జరిగితే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళను నాకు ఇక్కడే న్యాయం చేయండి అంటుంది కమల.
కట్ చేస్తే అప్పుడే శాంభవి కమల దగ్గరికి వచ్చి ఏ కమల నువ్వు ఈ ఊరి దానివే కదా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ వీళ్ళు పొరుగురు నుండి నిన్న మొన్న వచ్చినవాళ్లు వీళ్లు నన్ను ఇంతగా నమ్ముతుంటే నువ్వు మాత్రం నన్ను బజారుకీడ్చి పరువు తీయాలని చూస్తావా నువ్వు నమ్మింది ఇంతేనా నువ్వు ఈ ఊరు దాని వెయ్యండి ఇలాగే మాట్లాడతావా అంటుంది శాంభవి. అంజలిచూడండి శాంభవి గారు ఈవిడ ఏవేవో మాట్లాడుతుంది అవన్నీ మీకు ఎందుకు చెప్పండి ఈవిడకు నష్టపరిహారంగా ఒక పది లక్షలు తన ముఖాన విసిరేయండి అవి మీకు ఒక లెక్క చెప్పండి అని శాంభవి గారిని పొగుడుతూ ఉంటుంది. శాంభవి గారుచూసావా అంజలి ఎలామంచితనంతో మాట్లాడుతుందో సరే నువ్వు 10 లక్షలు అడుగుతున్నావు కాబట్టి నేను అంత ఇవ్వలేను కాకపోతే మనిషికి రెండు లక్షలు చొప్పున మీ ముగ్గురికి ఆరు లక్షల ఇస్తాను అంటు చరణ్ రాజ్ బీరువా లోనుండి ఆరు లక్షలు తీసుకువచ్చి తనకి ఇవ్వు అంటుంది చరణ్ రాజు వెళ్లి ఆరు లక్షలు తీసుకువచ్చి శాంభవి గారికి ఇస్తాడు.శాంభవి ఇదిగో కమల ఈ ఆరు లక్షలు తీసుకొని ఇకమీదట ఇటువైపు రాకుండా వెళ్ళిపో అంటుంది శాంభవి. కమల ఆరు లక్షల డబ్బు తీసుకొని శాంభవి గారి ఇంటి నుండి వెళ్లిపోతుంది.
అందరూ వెళ్లిపోయాక అంజలి అమృత బంటి అరుణ్ కుమార్ వాళ్లు నవ్వుకుంటూ ఉంటారు. అమృత అమ్మ అంజలి నువ్వు చాలా మంచి పని చేశావు ఈరోజు ఆవిడకు ఆవిడ పిల్లలకి బ్రతుకు దారిని చూపించావు నువ్వు వేసిన ప్లాన్ ప్రకారమే కదా ఆవిడకి నష్టపరిహారం దక్కింది ఇక ఆ డబ్బుతో తను తన పిల్లలని సంతోషంగా చూసుకోగలుగుతుంది మంచి చదువు చెప్పించగలుగుతుంది అందుకనే నువ్వు ఈరోజు చాలా మంచి పని చేశావు అంటుంది అమృత. కావేరి ఏంటి మీ అందరూ కలిసి అంత మంచి పని చేశారా మరి నన్ను పిలవలేదే నేను కూడా ఆ శాంభవి గారిని ఒక ఆట ఆడుకుందును అని అంటుంది కావేరి.చంద్రం ఇదిగో ఒక అవేరి ఈ ముచ్చట నీకు ముందే తెలిస్తే అంజలి వేసిన ప్లాన్ కాస్త ఫెయిల్ అయి ఉండేది. అందుకనే చెప్పలేదు అంటాడు చంద్రం కమల మళ్లీ అంజలి దగ్గరికి వచ్చి అమ్మ మీరు నాకు చేసిన సహాయానికి ఎప్పుడు మర్చిపోలేను అంటూ దండం పెడుతుంది.అంజలి నేనే మీకు థాంక్స్ చెప్పాలి ఎందుకంటేమీ ఆయన జయచంద్ర ఫౌండేషన్ కి సంబంధించిన ట్రస్ట్ మెంబర్గా ఇన్నాళ్లు శాంభవి గారితో న్యాయపోరాటం చేశాడు దానివల్లే ఆయన చనిపోయాడు మరి అలా న్యాయం కోసం పోరాడిన తన కుటుంబానికి నేను ఎంతో కొంత సహాయం చేయకపోతే అందులో న్యాయం ఏముంటుంది చెప్పండి అందుకే అలా చేయాలి అనిపించింది ఈ డబ్బుతో నువ్వు ఎక్కడికైనా సిటీకి వెళ్లి పిల్లల్ని బాగా చదివించి మంచిగా బ్రతుకు అని చెబుతుంది అంజలి. కమల అలాగేనమ్మ వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే శాంభవి చూసావా చరణ్ ఆ కమల మన ఇంటి పరువును మన పరువును బయటపెట్టాలని వస్తే ఆ అంజలి ఎలా డీల్ చేసిందో చూసావా అంటుంది చరణ్ రాజు అవునమ్మా అంజలి మనల్ని మన పరువు నీ రోడ్డున పడకుండా ఆరు లక్షలతో పంపించేసింది అని అంటాడు. శాంభవి అందుకే నాకు అంజలి అంటే ప్రత్యేకమైన అభిమానంఅంటుంది శాంభవి.అప్పుడే మాధవి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సరిపోయింది తల్లి కొడుకులు ఇలా ఆవిడకు వత్తాసు పలకడం వల్లే కదా అంజలి ఇలా చేస్తుంది అసలు మీరు తలుచుకుంటే ఆ కమల నోరు మూయించలేరా ఏంటి ఒక్క రూపాయ రెండు రూపాయల ఆరు లక్షలు మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి ఆ అంజలి ఆడుకుంది తెలుసాఅని అంటుంది మాధవి.శాంభవి చూడు మాధవి నువ్వు సలహాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా చెడగొట్టాలని మాత్రం చూడకు అంటుంది శాంభవి
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!