Pawan kalyan – Varun tej: మెగా ఫ్యాన్స్లో కొత్త టెన్షన్ మొదలైంది. ‘గని’ వర్సెస్ ‘భీమ్లా’..ఈ సినిమాలలో ఏది పోస్ట్పోన్ కానుంది..? అంటూ ఆసక్తికరంగా అందరూ చర్చించుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి తెలుగు రీమేక్. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఇమేజ్కు తగట్టు మార్పులు చేర్పులు చేసి తెలుగులో రూపొందిస్తున్నారు. సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇటీవల కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. కానీ, దీనిపై ఇన్నాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ మేకర్స్ తమ చిత్రాన్ని ఫిబ్రవరి 25నే విడుదల చేస్తున్నామని ఇటీవల అధికారికంగా
ప్రకటించేశారు. అయితే, ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమాని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తున్నామంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించి షాకిచ్చారు. ఈ నెలలో రావడం కష్టమని అనుకున్న వారందరూ ఈ స్టేట్మెంట్తో ఖంగు తిన్నారు.
Pawan kalyan – Varun tej: ఏ సినిమా పోస్ట్ పోన్ చేసినా మళ్ళీ ఏప్రిల్ వరకు ఆగాల్సిందే అంటున్నారు.
ఇప్పుడు గని చిత్ర మేకర్స్ పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అంటే బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఉంటుంది. అందుకే వీటిలో ఒక సినిమాను ఖచ్చితంగా వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అదే ఇప్పుడు అభిమానులకు పెద్ద కన్ఫ్యూజన్లో పడేసింది. రెండూ మెగా హీరోల సినిమాలే. ఏది పోస్ట్ పోన్ చేసినా అభిమానులు హర్ట్ అవుతారు. అలా అని వాయిదా వేయకుండా ఉండలేరు. అయితే, దాదాపు వరుణ్ తేజ్ నటించిన గని సినిమానే వాయిదా పడే అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవేళ ఏ సినిమా పోస్ట్ పోన్ చేసినా మళ్ళీ ఏప్రిల్ వరకు ఆగాల్సిందే అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!