Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్- మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్కు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అక్కడ బాక్సాఫీస్ వద్ద మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 7 భాషలలో రిలీజ్ చేస్తుండగా..హైదరాబాద్లో జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్తో మరింతగా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతూ వస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ రన్ టైమ్ తగ్గించినట్టు తెలుస్తోంది.
అది కూడా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సలహా మేరకు అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో బాహుబలి-ది బిగినింగ్ 2015 లో వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, బాహుబలి 2 – ది కన్క్లూజన్ 2017 లో వచ్చింది. ఈ రెండు భాగాలతో ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత సాహో సినిమాతో భారీ ఓపెనింగ్ రాబట్టి రికార్డ్ సాధించారు. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఆకాశానికి చేరుకుంది. ఈ సినిమాల ప్రభావం ఇప్పుడు అన్నీ రకాలుగా రాధేశ్యామ్ సినిమా మీద పడబోతుందంటున్నారు.
Radhe shyam: మంచి సీన్స్ ఎగిరిపోతే ఏంటి పరిస్థితి..!
ముఖ్యంగా సినిమా నిడివి విషయంలో కొత్త టాక్ వినిపిస్తోంది. మొత్తంగా 138 నిమిషాల నిడివి వచ్చిందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ ను 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్లో చెప్పుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారి చేశారు. అప్పుడు సినిమా నిడివి 150 నిమిషాలు వచ్చిం. అనగా 2 గంటల 30 నిమిషాలనమాట. ఇప్పుడు ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలకు వచ్చిందని తెలుస్తోంది. తెలుగులో మాత్రమే కాదు హిందీ వెర్షన్లో కూడా ఇలాంటి మార్పులు చేసారట. రాధేశ్యామ్ చూసిన దర్శకుడు రాజమౌళి ఈ మార్పులను సూచినట్టు..ఆ మేరకు మేకర్స్ నిడివి తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే, ఒకవేళ నిడివి తగ్గించిన కారణంగా మంచి సీన్స్ ఎగిరిపోతే ఏంటి పరిస్థితి అని ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి రాధేశ్యామ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.