Trivikram Srinivas: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దాంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమా లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేదనే సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు సినిమాలతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. అయితే, బుల్లితెర మీద ఈ రెండు సినిమాలు ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
అయితే, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో అనగానే అంచనాలు మాత్రం ఏమీ తగ్గలేదు. ఈ కారణంగానే ఒక ఫ్లాప్ దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇవ్వని మహేశ్ త్రివిక్రమ్ కి మూడవసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే బాబుకి రెండు ఫ్లాపులిచ్చిన త్రివిక్రమ్ తో మళ్ళీ సినిమా చేస్తున్నాడంటే కారణం.. ఆయన చెప్పిన కథ విపరీతంగా నచ్చడమే. ఇక త్రివిక్రమ్ కూడా ఈసారి ఎలాగైనా బాబుకి భారీ హిట్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకే, ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. ఇక అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలకు వేసిన భారీ ఇంటి సెట్స్ను ప్రస్తుతం సిద్దం చేయిస్తున్నట్టు తాజా సమాచారం.
Trivikram Srinivas: సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు..
మెజారిటీ భాగం చిత్రీకరణ ఆ ఇంటి సెట్లోనే జరపనున్నట్టు తెలుస్తోంది. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలలో ఉన్న భారీ ఇంటి సెట్స్ ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడు మహేశ్ సినిమా కోసం వేస్తున్న ఇంటి సెట్ ఆ రెండికంటే కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం థమన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. సర్కారు వారి పాట సినిమాను మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!