మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస పెట్టి విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల “RRR”తో బాక్స్ ఆఫీస్ వద్ద తన దమ్ముంటే నిరూపించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన గాని రామరాజు పాత్రలో చరణ్ పెర్ఫార్మన్స్ ఎవరు అంచనా వేయలేని రీతిలో.. అద్భుతంగా రాణించాడు. రామరాజు పాత్రకి చాలామంది ఫిదా అయ్యారు. “RRR” సినిమాతో ఓవరాల్ ఇండియాలో చరణ్ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. బాలీవుడ్ సైతం చరణ్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయింది. ఇదిలా ఉంటే చరణ్ ఇప్పుడు మరో చరిత్రత్మికమైన సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే భారతదేశాన్ని పూర్వపు కాలం రాజులు పాలించిన టైంలో 11వ శతాబ్దానికి చెందిన రాజా సూహైల్ దేవ్ జీవితాన్ని వెండి ధరపై చూపించడానికి ఓ ప్రముఖ డైరెక్టర్ రెడీ అయినట్లు టాక్. అతడు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అని ఆ రాజు పాత్రలో రామ్ చరణ్ నీ చూపించాలని చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రచయిత అమిత్ త్రిపాటి రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో రాజుల కాలం నాటి యుద్ధ సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. గతంలోని ఇదే తరహాలో రామ్ చరణ్ మగధీర సినిమా చేయటం జరిగింది. రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఇండస్ట్రీ హిట్ అయింది.
చరణ్ కి రెండో సినిమా అయినా గాని.. యాక్టింగ్ పరంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత రాజుల కాలం నాటి సినిమా రామ్ చరణ్ చేయబోతున్నట్లు రాజా సూహైల్ దేవ్ జీవితా కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు రావడంతో.. అభిమానులు సినిమా ఓకే అయితే బాగుండు అని .. తాజా వార్త పై రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్… శంకర్ దర్శకత్వంలో తన కెరియర్ లో 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. శంకర్ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి.. సినిమా చేయనున్నారు. అంత మాత్రమే కాదు తమిళ దర్శకులకు కూడా చరణ్ అవకాశాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కమిట్మెంట్స్ మొత్తం అయిన తర్వాత..రాజా సూహైల్ దేవ్ బయోపిక్ చరణ్ చేయనున్నట్లు సమాచారం.