SaidharamTej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా కెమెరా ముందుకు వచ్చి సర్ప్రైజ్ చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 10 వ తేదీన సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైయ్యాడు. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అపోలో హాస్పిటల్లో దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొంది పూర్తి స్థాయిలో రికవర్ అయ్యాక ఇల్లు చేరుకున్నారు. ఇక అదే క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి సాయి ధరమ్ తేజ్ను అభిమానులకు, ప్రేక్షకులకు చూపించి సర్ప్రైజ్ చేశారు.
ఇక ఇటీవలే సాయి ధరమ్ తనను కాపాడిన మొదటి వ్యక్తి నుంచి వైద్య బృందానికి, తనని చూసేందుకు హాస్పిటల్కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులకు పేరు పేరునా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని వదిలాడు. దాంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు సాయి ధరమ్ కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడని ఉత్సాహంగా చెప్పుకున్నారు. ఆ విధంగానే తేజ్ తన 15వ సినిమాతో తాజాగా సెట్స్లో అడుగుపెట్టాడు.
SaidharamTej: మొదటి సారి ఓ థ్రిల్లర్ సినిమాలో..
సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్, బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ అధినేత బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మొదటి సారి ఓ థ్రిల్లర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మెగా హీరో సాయి ధరమ్ తేజ్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అన్నీ అనుకున్నట్టు పూర్తైతే గనక ఈ ఏడాది దసరా బరిలో దింపబోతున్నట్టు సమాచారం.