RC15: ప్రస్తుతం దేశవ్యాప్తంగా గంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుల హవా కొనసాగుతోంది. రాజమౌళి RRR, ప్రశాంత్ నీల్ KGF2, లోకేష్ కనగారాజ్ “విక్రమ్”. ఈ యేడాది ప్రథమార్థంలో వచ్చిన ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టడం జరిగింది. RRR, KGF 2.. ఈ రెండూ కూడా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. అయితే సౌత్ ఇండియాలో ఈ దర్శకుల కంటే ముందుగానే మంచి క్రేజ్ దక్కించుకున్న శంకర్ మాత్రం గతంలో తరహా స్థాయిలో సినిమాలు చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కమల్ హాసన్ తో చేసిన “ఇండియన్ 2” ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో ఇప్పుడు శంకర్ తన ఫోకస్ మొత్తం “RC15” పైనే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.
దసరా పండుగకు ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ నీ మూడు విభిన్నమైన పాత్రల్లో శంకర్ చూపించనున్నట్లు అందులో ఒకటి ముఖ్యమంత్రి మాత్రం అన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే చరణ్ సినిమా తర్వాత శంకర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో సెన్సేషనల్ న్యూస్ గా నిలిచింది. ఇద్దరు టాప్ హీరోలలో ఒకరితో చేయాలని శంకర్ అనుకుంటున్నరట. వాళ్ళు మారేవరో కాదు యాష్, ఎన్టీఆర్. దాదాపు ఎన్టీఆర్ అన్నట్లు ఎప్పటినుండో వార్తలు కానీ ఇప్పుడు యాష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు టాప్ హీరోలలో ఒకరితో శంకర్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.