నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొంత కాలం నుండి తన చర్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. తనపై సొంత పార్టీ నేతలే కేసులు పెట్టడంతో రెండు క్వాష్ పిటీషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లలో పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టును గతంలో ఆశ్రయించిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రత కావాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని వెంటనే భద్రత కల్పించాలని హోమ్ శాఖ కార్యదర్శిని గతంలో కోరిన విషయం తెల్సిందే. ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.