వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్ విజయ్ సాయి రెడ్డి మరియు లోక్ సభలో ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి ఇంకా ఎంపీ లు అయిన మార్గని భరత్, సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాని ఉద్దేశించి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ నుండి మాట్లాడుతారు.
రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్ వ్యవహారంపై మరియు అతనిపై ఎంపీ పదవి నుండి అనర్హత వేటు వేయించేందుకు లోక్ సభ స్పీకర్ ను కలిసేందుకు వెళ్లిన వీరంతా ఎలాగైనా అతని పై అనర్హత వేటు వేయించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. అదేపనిగా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ పయనమైన వీరంతా స్పీకర్ ను కలిసిన వెంటనే మీడియాని ఉద్దేశించి అక్కడ జరిగిన చర్చ గూర్చి ప్రసంగిస్తారు.
ఇకపోతే విజయసాయిరెడ్డి తో సహా పలు పార్టీలు కీలక నాయకులు పై అనేక ఆరోపణలు మరియు అభియోగాలు చేసిన రఘురామకృష్ణంరాజు ఏకంగా పార్టీ యొక్క స్టేటస్ ను సంకటంగా లో పడేసిన విషయం తెలిసిందే. అయితే రఘురామకృష్ణంరాజు ముందుచూపుతో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీంతో స్పీకర్ ను కలవడమే కాకుండా దిల్లీ లో విలేఖరులందరి ముందు అతనిని తీవ్రంగా విమర్శించాలని ఎంపీ లంతా ఫిక్స్ అయినట్టున్నారు. ఇక లోక్ సభ స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మరియు హైకోర్టు విచారణ జరిపి ఇచ్చే ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయి అంటే అప్పుడు ఏపీలో అసలు రాజకీయం మొదలవుతుంది.