Mukhtar Abbas Naqvi: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నఖ్వీ 2010 నుండి 2016 వరకూ యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కాగా, 2016 నుండి 2022 జూలై 6 వరకూ జార్ఘండ్ నుండి రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. బీజేపీ మరో మారు రాజ్యసభ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయనను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టనున్నదని వార్తలు వినబడుతున్నాయి. పార్టీలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నేతగా నఖ్వీ ఉన్నారు. ఈ సారి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎస్టీ మహిళ అయిన ద్రౌపది ముర్ముకు నిలిపిన బీజేపీ.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ముస్లిం మైనార్టీ వర్గానికి ఇచ్చే ఆలోచన చేస్తొందని అంటున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ బేటీలో నఖ్వీ సేవల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. దీంతో ఉప రాష్ట్రపతి రేస్ లో నఖ్వీ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
ప్రస్తుతం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో సారి కొనసాగించే అవకాశం లేదన్నట్లు సమాచారం. రాష్ట్రపతి పదవి ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చినందున ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాది రాష్ట్రాలకే ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్ ప్రకారం వెంకయ్య నాయుడుకి మరో సారి పొడిగించే అవకాశం లేదు.