Bhumana Karunakar Reddy: శాసనసభ ఉప సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కమిటీ భేటీ అయ్యింది. భేటీ అనంతరం భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుండి 2019 మధ్య పెద్ద కుట్ర జరిగిందని అన్నారు. రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్దంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందని వ్యాఖ్యానించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆనాడు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజన్సీల ద్వారా ప్రయత్నించారని అన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి ఉడ్డదారుల్లో రాజకీయ లబ్దిపొందేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీని వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఉందని దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, మద్దాలి గిరి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలో ఏపిలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెసిసిందే. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెగాసస్ పై ఏపి అసెంబ్లీలో చర్చించిన అనంతరం విచారణకు ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఉప సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉప సంఘం పలు దఫాలు సమావేశాలను నిర్వహించింది.