Munna Gang Judgement: ప్రకాశం జిల్లా ఒంగోలు అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారిపై నేరాలకు పాల్పడిన 12 మంది దోషులకు ఉరి శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చింది. 12 మందికి ఒకే కేసులో ఉరి శిక్ష విధించడం బహుశా దేశంలో ఇదే పెద్ద శిక్ష అయి ఉంటుంది. దేశంలో ఇంత పెద్ద సంచలమైన తీర్పులు లేవు. 17 మందిని చంపిన ఏడూ కేసుల్లో మొత్తం 18 మంది నిందితులుగా ఉండగా… 12 మందికి ఉరి శిక్ష విధించగా.. మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష.., మరో ఇద్దరికీ పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఈ గ్యాంగ్ కి ఉరి శిక్ష విధించాలనీ డిమాండ్లు ఉన్నాయి. దాదాపు పన్నెండేళ్ల కిందట ఈ గ్యాంగ్ చాలా ఆకృత్యాలు, హత్యలు చేస్తూ జాతీయ రహదారిపై భయపెట్టింది.
Munna Gang Judgement: దారుణమైన ఆకృత్యాలు..!!
హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మంది దోషులకు ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఆరుగురుకి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య కేసులు ఈ మున్నా గ్యాంగ్పై ఉన్నాయి. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో వీరు దోషులుగా తేలడంతో కోర్టు ఈమేరకు శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. 2008 ప్రాంతంలో మున్నా సహా మరో 12 మంది కలిసి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపేవారు. పోలీసులమని చెప్పి.., లారీలను ఆపి, డ్రైవర్లు, క్లీనర్లను చంపేసి మద్దిపాడులోని గుండ్లకమ్మ నది వద్ద ఇసుకలో ఆ శవాలను పాతిపెట్టేసేవారు. అప్పట్లో ఈ కేసులు రాష్ట్రం మొత్తం సంచలనం కలిగించాయి. పోలీసులకు చుక్కలు చూపించాయి. చివరికి తమిళనాడు చెన్నైకి చెందిన ఓ లారీ యజమాని రెండు టోల్ గేట్లు మధ్య సీసీటీవీ వీడియోలు పరిశీలించి, ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై కూపీ లాగగా పోలీసులు మొత్తం శోధించి, ఈ గ్యాంగ్ సహా వీరికి సహకరిస్తున్న మరో ఆరుగురిని పట్టుకున్నారు. దాదాపు పన్నినదెల్ల ప్రాసిక్యూషన్ తర్వాత ఈరోజు వీరికి శిక్ష ఖరారు అయింది..!