Yellow fungus: కరోనా వైరస్ ఏ మూహూర్తాన ఎంటర్ అయ్యిందో ఏమో కానీ దాని తరువాత వరుసగా కొత్త కొత్త ఫంగస్ వెలుగు చూస్తుండటం ఒక పక్క ప్రభుత్వాలను, ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తుంది. నిన్న మొన్నటి వరకూ కరోనా నుండి కోలుకున్న కొందరిలో బ్లాక్ ఫంగస్ వెలుగుచూడగా ఆ తరువాత వైట్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసుల భయం వీడకముందే ఇప్పుడు తాజాగా ఎల్లో ఫంగస్ వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ఎల్లో ఫంగస్ కేసు బయటపడింది. దీనిపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఫంగస్ బ్లాక్, వైట్ కంటే మరింత ప్రమాదకరమని భావిస్తున్నారు. ఎల్లో ఫంగస్ కేసు వెలుగుచూడటంతో ఆక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ నేతృత్వంలో చికిత్స చేస్తున్నారు.
Read More: Upendra: ‘సీఎం కావాలనుంది..’ కోరిక బయటపెట్టిన స్టార్ హీరో..
Yellow fungus: ఎల్లో ఫంగస్ లక్షణాలు ఏమిటంటే..
బద్దకం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్లో ఫంగస్ వల్ల శరీరంలో చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. ఎల్లో ఫంగస్ అంతర్గతంగా అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యల్లో ఫంగస్ లక్షణాలు బయటపడితే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.