రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక్క సుధీర్ బాబు కి తప్ప .. నిర్మాత దిల్ రాజు కి, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కి, హీరోయిన్స్ నివేదా థామస్, అదితీరావు హైదరీ, హీరో నాని లకి పెద్ద మైనస్ గా మారింది. నివేదా కంటే కూడా ఎక్కువగా అదితీరావు హైదరీ కే వి సినిమా తీవ్రంగా నిరాశ పరచింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అదితీ మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఇక స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరుతుందని అందరు అనుకున్నారు.
అదితీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి సినిమాలు చేస్తుందన్న పేరు.. క్రేజ్ సంపాదించుకుంటున్న సమయంలో ఒక సినిమా గట్టి దెబ్బ కొట్టింది. స్టార్ హీరోయిన్ కి చాలా దూరంలో ఆగిపోయింది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం లో అదితీరావు హైదరీ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన తాజాగా ప్రకటన వెలువడింది.
అలాగే నాని నటిస్తున్న మరో సినిమా కి అదితీరావు హైదరీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే వి ఫ్లాపయి ఈ అవకాశాలు దూరం చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి అదితీరావు హైదరీ మీద వి సినిమా ప్రభావం బాగానే పడింది.