అమరావతి: రాష్ట్రంలో ఇసుక సమస్యపై పోరాటానికి టిడిపి సిద్ధమయ్యింది. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరాహార దీక్షకు దిగారు. లోకేష్ దీక్షకు సంఘీభావంగా పార్టీ ఎంపి గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా అనంద్బాబు తదితరులు కూర్చున్నారు.
రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైసిపి నేతలు దోచుకుంటున్నారని నేతలు ఆరోపించారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల బలన్మరణాలపై ముఖ్యమంత్రి జగన్ ఒక్క సారైనా సమీక్షించారా అని నేతలు ప్రశ్నించారు. వీరి నిరాహార దీక్ష సాయంత్రం అయిదు గంటల వరకూ కొనసాగనుంది.