తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ అడుగులు గతానికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో మాట్లాడే విషయంలో సమస్యలను పరిష్కరించే తరుణంలో చాలావరకు మీడియా ముందే నవ్వులపాలయ్యే రీతిలో వ్యవహరించడం మనకందరికీ తెలిసిందే.
దీంతో లోకేష్ పై సొంత పార్టీలోనే రాజకీయంగా అన్ ఫిట్ అనే టాక్ వచ్చింది. ఇక 2019 ఎన్నికలలో కూడా ఓడిపోవడంతో లోకేష్ వల్ల పార్టీకి లాభం ఏమీ ఉండదని చాలా మంది టిడిపి కి చెందిన బలమైన నేతలు అంతర్గతంగా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా ఇటీవల కరోనా సమయంలో లోకేష్ హైదరాబాదు ఇంటికే పరిమితం కావడంతో మరింతగా విమర్శలు పెరిగాయి.
అయితే గత కొన్ని రోజుల నుండి నారా లోకేష్ వ్యవహారం చూస్తే ఎవరైతే తనని రాజకీయాలకు పనికి రారు అని అన్నారో వారిచేత శభాష్ అనిపించుకున్నే రీతిలో తాజాగా వ్యవహరిస్తున్నట్లు టీడీపీ పార్టీలో టాక్. పూర్తి మేటర్ లోకి వెళ్తే క్షేత్రస్థాయి పర్యటన లతోపాటు ఇటీవల వరదల సమయంలో నేరుగా రైతులతో పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం తో లోకేష్ గతంలో మాదిరిగా లేరన్న టాక్ సొంత పార్టీలోనే గట్టిగా వినబడుతున్నాయి. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయటంలో లోకేష్ మాట తీరు గతానికి భిన్నంగా ఉందని, పరిణితి చెందాడని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారధి లోకేషే అని తాజాగా ఆయన పర్యటిస్తున్న తీరుపై సమస్యలపై పోరాడుతున్న విధానం పై సొంత పార్టీలో చాలా మంది నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా జనంలోకి వెళ్లి వాళ్ళతో మమేకమవుతూ సమస్యలను లోకేష్ తెలుసుకోవటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అని సొంత పార్టీ నేతలు మాత్రమే కాదు ఇతర పార్టీ కి చెందిన నాయకులు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.