“నువ్వు పెట్టిన క్షోభ భరించాను. ప్రేమ కోసం పరితపించాను. నీఛాతి నీచంగా వ్యవహారిస్తున్న మనసులోనే దాచుకున్నాను… తట్టుకోలేక తనువు చాలిస్తున్నాను. అయినా నీ మీద ప్రేమ తోనే ఉన్నా…” హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉంటూ సాఫ్టువేరు ఉద్యోగం చేస్తూ…ఆత్మహత్య చేసుకున్న లావణ్య లహరి చివరి మాటలు ఇవి.
ఈమె స్వగ్రామం ప్రకాశం జిల్లా దర్శి. లావణ్య లహరి తల్లి ప్రభుత్వ జూనియరు కళాశాల ప్రిన్సిపాల్. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుని గా పని చేసి రిటైర్ అయ్యారు. లావణ్య కు మరో సోదరి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ గురు వృత్తిలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఉపాధ్యాయులు గా నిబద్ధతతో ఉండే ఆ తల్లిదండ్రులు బిడ్డలిద్దరిని మంచి చదువులు చదివించారు. చదువుల మధ్యలోనే… లావణ్య వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. లావణ్య తన ప్రేమ తన సర్వస్వం అని నమ్మింది. అదే జీవితంలో బ్రతుకుతూ వచ్చింది. చివరికి ఇంట్లో పెళ్లి చేసారు. అతను నీతి తప్పాడు. నిస్సిగ్గుగా వ్యవహరించాడు. మృగం లా ఆమెను హించించాడు. ప్రేమ లో నుంచి బయటకు రాలేక పోయిన ఆ పిచ్చి తల్లి నిలువునా తన ప్రాణాలు తీసుకుంది. ఆ సంఘటనతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దర్శిలో ఇప్పుడు విషాద ఛాయలు ఉన్నాయి.
ఒక్క క్షణం లావణ్య తను కన్న వారి గురించి ఆలోచించి ఉంటే….ప్రేమ ముసుగులో మోసపోయానని తెలుసుకుని భవిష్యత్తు ను మరోలా ఆలోచించి ఉంటే.. ఆ మృగాన్ని తన జీవితంలో నుంచి బయటకు పంపడం చట్ట పరంగా సులువైన పని.ఇంటి దగ్గర తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.స్వతహాగా జీవించ గలిగే శక్తి ఉంది.చేదు జ్ఞాపకాలను తుడిపేసుకుని ..మంచి జీవితం ఆవిష్కరించుకోవడం ఆమెకు పెద్ద కష్టం కాదు…గుడ్డిగా ప్రేమ తన జీవితం అనుకుని..ఆ అలోచన ల నుంచి బయటకు రాలేక ఊపిరి తీసుకుంది.తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది.
అయితే ఆమె భర్తతో వివాహేతర సంబంధం నడిపిన మహిళా ఎవరు..? ఇది వరకు లావణ్యకు, ఆ మహిళకు ఏమైనా వివాదం జరిగిందా..? భర్త ఉద్దేశ పూర్వకంగానే లావణ్యాన్ని మానసికంగా వేధించారా..?? అసలు లావణ్య నిజంగా ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఏమైనా మలుపులు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.