జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రోజులసలు ఏమీ బాగాలేవు !! కొందరు కాపు సామాజికవర్గానికి చెందిన వైకాపా మంత్రులు, నేతలు, కాపు సోదరులు పవన్ ను రౌండేసేస్తున్నారు.
కాపులకు బాబు హయాంలో పరిపూర్ణమైన అన్యాయం జరిగినప్పుడు, కాపులను తీవ్రంగా అణగదొక్కినప్పుడు.. మౌనంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటూ నిజజీవితంలో కూడా నటించిన పవన్.. కాపులకు న్యాయం చేస్తున్న వైఎస్ జగన్ ను విమర్శ్తిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి కన్నబాబు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పవన్ పై విరుచుకుపడ్డారు
కాపులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపినప్పుడు, కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాడినప్పుడు,ఆయనను టిడిపి ప్రభుత్వం చిత్రహింసలు పెట్టినప్పుడు, కాపు కార్పొరేషన్ లో సరైన నిధులు కేటాయించబడనప్పుడు, కాపులకు – బీసీలకు మధ్య తాంబూలాలిచ్చి తన్నుకుచావమనేలా బాబు రాజకీయం చేసినప్పుడు.. పవన్ చూడలేదా.. కానరాలేదా? నాడున్న బాబు మైకంలో కాపులు గుర్తుకు రాలేదా? నేడు బీజేపీ సరసన చేరిన తరుణంలో.. రాజకీయంగా ఒక బలమైన సామాజికవర్గం తోడు తనకుందనే విషయాన్ని కమలం పెద్దల దగ్గర నిరూపించుకునే క్రమంలో.. కొత్తగా కాపులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని పలువురు కాపు నాయకులు, కాపు సోదరులు ప్రశ్నిస్తున్నారు!
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా? పాత మిత్రుడు చంద్రబాబుతో చెలిమిని పోగొట్టుకోలేక పవన్ మాట్లాడుతున్నారా? అంటూ తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు మాట్లాడారా అని.. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో చేతులు కలిపడం కరెక్టా అని.. టీడీపీ హయాంలో కాపు సోదరులు, యువకులపై అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొట్టేయించిన సంగతి తెలియదా అని పవన్ ను ప్రశ్నించారు.పవన్ పై ఎవరు మాట్లాడినా, ఏమని ప్రశ్నించినా.. అవి పవన్ సమాధానం చెప్పలేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అనడంలొ సందేహం లేదనే చెప్పాలి.