Fuel rate: ప్రస్తుతం సామాన్యులు బతికే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దాంతో సామాన్యుడి నడ్డీ విరుగుతున్నది. ఇటీవల మళ్లీ పెరిగిన ధరలతో సామాన్యుడు ఇక పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా నడిపే బండ్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెట్రోల్ ధర విమానంలో ఉపయోగించే ఫ్యూయల్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం..
Yuvaraj singh: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ వెనక ఇంతా కథ ఉందా …?
లీటర్ పెట్రోల్, విమాన ఫ్యూయల్ మధ్య ధర తేడా ఎంతంటే..
పెట్రోల్, డీజిల్ ధరలను ఇలా రోజురోజుకూ పెంచుకుంటూ పోవడం పట్ల సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడుతోంది. ప్రతిపక్షాలు అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09 కాగా డీజిల్ ధర రూ.103.18గా ఉంది. ఈ క్రమంలోనే విమానాల్లో ఉపయోగించే ఇంధనమైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ లీటర్ ధర కేవలం రూ.65 ఉండటం గమనార్హం. లీటర్ పెట్రోల్ , విమాన టర్బైన్ ఫ్యూయల్ మధ్య తేడా రూ.45 ఉండటం చూసి సామాన్యులు షాక్కు గురవుతున్నారు.
Fuel Price Rise: 44రోజుల్లో 25 సార్లు పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు!శరవేగంతో వంద మార్కును దాటేసిన వైనం !!
ఇప్పటికైనా ధరలు తగ్గేనా?
హైదరాబాద్ సిటీలోనే కాకుండా వేరే నగరాల్లోనూ లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్లో రూ.110గా ఉండగా, ముంబైలో రూ.77.3, ఢిల్లీలో రూ.79.02, చెన్నయ్లో రూ.81.20 ఉంది. అయితే, అక్కడ కూడా క్రమంగా లీటర్ పెట్రోల్ , డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని వాహనదారులు, సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రోజుకు ఆ రోజు ఉన్న అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నారు.
అయితే, ఇలా పెంచే ప్రక్రియ కొనసాగు..తూనే ఉంటే సామాన్యులు ఇంకా బండ్లు నడిపే పరిస్థితులు ఉండబోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజానీకం ఇబ్బుందులు పరిశీలించి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.