ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో మళ్లీ వాహనాలకు సరి- బేసి విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. మొక్కలు పెంచడం సహా పలు చర్యలు చేపట్టామని, అవసరమనుకుంటే మరో సారి వాహానల విషయంలో సరి- బేసి విధానాన్ని అములు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
సరి బేసి విధానాలలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా సరిసంఖ్యలో ఉన్న వాహనాలు రోడ్లపై తిరగడానికి ఒక రోజు కేటాయిస్తారు. ఆ రోజు బేసి సంఖ్య వాహనాలు రోడ్లపైకి రావడానికి అనుమతించరు. అలాగే మరో రోజు బేసి సంఖ్య వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. దీని వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గతంలో ఈ విధానం అమలు చేశారు. అప్పట్లో ఇది సత్ఫలితాలను ఇచ్చింది.