ఈ కరోనా మహమ్మారి రాకతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. ఎంతో హాయిగా సాగుతున్న జీవితాల్లో తుఫానులా వచ్చి అంతా గందరగోలం చేసేసింది. పండగలు, పబ్బాలు, సరదాలు, ముచ్చట్లు ఏవీ లేకుండా ఏకాకీ జీవితంలా మనిషిని మార్చేసింది ఈ కరోనా మహమ్మారీ. దీని మూలంగా ఎంతో మంది అకేషన్స్ ని మిస్సవుతున్నామని బాధపడిపోతున్నారు. అయితే దీని మూలంగా పండగలే కాకుండా దావతులకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే ఈ కరోనా రాకతో చాలా మంది పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. అయితే కరోనా మనల్ని విడిచి పెట్టేలా లేదని ప్రభుత్వాలకు కూడా అర్థమవ్వడంతో పెళ్లిల్లకు, ఫంక్షన్లకు అనుమతులు జారీ చేసింది. అయితే పర్మీషన్ ఇచ్చింది కదా అని పెండ్లిళ్లకూ, పేరంటాకు ప్రజలు కుప్పలు తెప్పలుగా బయలు దేరుతూ కరోనా రాకుండా ఉండటానికి నివారణా చర్యలను మాత్రం పాటించడం లేదు. అందుకే దేశ రాజధాని ఢిల్లీలో కఠిన ఆంక్షలను మళ్లీ అమలు చేయబోతున్నారు.
కరోనా వైరస్ రోజురోజుకు విజృంబిస్తున్న కారణంగా దానిని అడ్డుకునేందుకు కొన్ని ఆంక్షలను చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో పెళ్లి కి హాజరయ్యే వారి సంఖ్యలో మార్పులు చేర్పులు చేసింది. అయితే ఇంతకు ముందులా పెళ్లికి 200 మంది హాజరు కాకుండా 50 మందికే అనుమతినిచ్చింది. దీనితో పాటుగా కరోనా విజృంబిస్తున్న ప్లేస్ లను కూడా మూసివేయాలని ఆంక్షలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు… పెండ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే కరోనా హాట్ స్పాట్లుగా ఉన్న మార్కెట్లను కూడా మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు పంపామని తెలిపారు. దానికి ఆయన ఆమోద ముద్ర కూడా వేశారని తెలిపారు. కాని కరోనా రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.