ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం చూపెడుతుంటారు. కొంత డబ్బు చేతిలో ఉంటే చాలు వారి ఆనందానికి అవదులే ఉంటవు. తుర్రుమని గోల్డ్ షాపులముందు వాలి పోతుంటారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గోల్డు కున్న ప్రత్యేక స్థానం వేరే ఏ దేశాల్లో ఉండదేమో.. అందుకే మన దేశం గోల్డ్ వినియోగంలో రెండో స్థానంలో ఉంది మరి. అంతలా కొంటారు మన లేడీస్..
అందుకే గోల్డ్ వినియోగంలో మన దేశం ఇలా ముందుంది. అందుకే కాబోలు కరోనా మహమ్మారి వచ్చినా గోల్డ్ ధరలు మాత్రం పైపైకి చేరి ఒక స్థాయిలో ఆకాశాన్ని అంటుకున్నాయి. అయినా కరోనా సమయంలో గోల్డ్ కొనే వారు ఎంతమంది ఉన్నారో తెలియదు కాని గోల్డ్ ధరలు మాత్రం గగన్నంటాయి. అయితే కొన్ని నెలలుగా మళ్లీ బంగారం వినియోగం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే పెళ్లి పందిళ్లు మళ్లీ ఊపందుకున్నాయిగా..
అందుకే కాబోలు గోల్డ్ వినియోగం కూడా బాగానే పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే మన దేశంలో బంగారం , వెండి ధరలు వరుసగా మూడో రోజు నేడు కూడా క్షీణించుకుంటూ వచ్చాయి. ఈ వార్త గోల్డ్ కొనే వారికి శుభవార్తే అవుతుంది కదా.. అయితే ఈ రోజు ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ఖరీదు 0.43 శాతం తగ్గింది. దానితో ఈ రోజు బంగారం ధర రూ.50,546 గా రన్ అవుతోంది.
అలాగే ఎంసీఎక్స్ లో సిల్వర్ ఫ్యూచర్స్ ఖరీదు 0.6 శాతం తగ్గి కిలోకు రూ.62,875 కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ఔన్స్ ఖరీదు 0.45 శాతం తగ్గింది. దీంతో 1,876.85 డాలర్లకు చేరుకుంది. అలాగే విలువైన లోహామైన వెండి ఔన్సు ధర 0.65 శాతం తగ్గి 24.47 డాలర్లకు చేరుకుంది. కాగా మనదేశంలో బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తారు. అలాగే 3 శాతం జీఎస్టీ అమలులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా గోల్డ్ ను కొనాలను కునే వారు బంగారు ఆభరణాలను సొంతం చేసుకోండి.