Asaduddin Owaisi : హైదరాబాద్పై ఎంఐఎం అధ్యక్షుడు,లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కొత్త వివాదం రేపారు.
ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుందని… లోక్సభలో అసదుద్దీన్ ఆరోపించారు. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు సభలోనే ఉన్నారు. అందరి సమక్షంలోనే అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.జమ్ముకశ్మీర్ విభజన చట్టంపై జరిగిన చర్చలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నోను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలన్నదే కేంద్రప్రభుత్వం విధానమన్నారు. ఇందులో భాగంగానే తొలిగా కశ్మీర్పై ప్రయోగం చేశారన్నారు.జమ్ముకశ్మీర్ పరిణామాలకు మద్దతు పలుకుతున్న వారంతా… హైదరాబాద్, లక్నో, ముంబై, బెంగళూరును కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినప్పుడు గగ్గోలు పెడతారని హెచ్చరించారు.అయితే వెంటనే తెలంగాణ బిజెపి నేతలు రంగంలోకి దిగి ఒవైసీ వ్యాఖ్యలను ఖండించారు.
Asaduddin Owaisi :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండన !
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్తోపాటు మరికొన్ని చెన్నై, బెంగళూరు, లక్నో నగరాలను భవిష్యత్లో కేంద్రం యూటీగా మార్చేస్తుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు స్పందనగా కిషన్ రెడ్డి పైవిధంగా సమాధానం ఇచ్చారు. అబద్ధాలు ప్రచారం చేయడం, వాస్తవాలను వక్రీకరించడం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ పార్లమెంట్ నుంచి పారిపోయారని విమర్శించారు.
రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్!
అలాగే హైద్రాబాద్లోని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఒవైసీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.గ్రేటర్ కార్పొరేషన్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏమీ వర్కవుట్ కాకపోవడంతో మెంటల్ గా డిస్ట్రబ్ అయి ఓవైసీ ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నగరంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుండటంతో వాటిని క్యాష్ చేసుకోవటానికి కూడా ఇప్పటి నుంచే ఆయన ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్నారు.కేంద్రానికి అలాంటి ఆలోచనే లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.ఓవైసీ చేసిన నిరాధారమైన ఆరోపణలను నమ్మరాదని ఆయన హైద్రాబాద్ ప్రజలను కోరారు.